Sunday, August 16, 2020

వినాయక చవితి పూజా విధానం మరియు వ్రత కథ (VINAYAKA CHAVITHI PUJA)

|| వినాయక చవితి పూజా విధానం మరియు వ్రత కథ ||

ఓం మహా గణాధిపతయే నమః
ఓం ఉమామహేశ్వరాయ నమః
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్  ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే  ||

ఓం మహా గణపతేభ్యో నమః
ఓం సర్వేభ్యో గురుభ్యో నమః .

ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః .
ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః

ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః
ఓం శచీపురందరాభ్యాం నమః

ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
ఓం మాతా పితరాభ్యోం నమః

ఓం నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః
అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఆత్మశుద్ధి

చేతిలోకి నీటిని తీసుకొన్ క్రింది శ్లోకం చెప్పి తలపై చల్లుకుని, మిగతా భక్తులపై, పూజా ద్రవ్యాలపై చల్లి శుద్ధి చేసుకోవలెను.

ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థా గతో పి వా |
      యః స్మరేత్ పుండరీకాక్షః స బాహ్యాభ్యంతరః సుచిః ||

      పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షయ నమః

గణపతి నమస్కారం

ఓం శుక్లామ్భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం,
       ప్రసన్న వదనం ద్యాయే త్సర్వ విఘ్నొపశాన్తయే.

అని పై శ్లోకం చెప్పి ప్రథమ దేవుడైన గణపతికి నమస్కారం చేసుకోవాలి

దీప పూజ

ఓం దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
      సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

అని పై శ్లోకం చెప్పి దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము, కుంకుమబొట్లు పెట్టి నమస్కరించుకోవాలి

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాదవాయ స్వాహా
అని చెప్పి మూడుసార్లు చేతిలోకి నీరు తీసుకోని త్రాగవలెను. తరువాత చేతులు కడుగుకొని క్రింది నామాలను చదువుకోవలెను


ఓం గోవిందాయ నమః,
ఓం
విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్ననాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం
సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్మాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అథొక్లజాయ నమః
ఓం నారసీంహాయ నమః,
ఓం అచ్యుతాయ నమః
ఓం
జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీ కృష్ణాయ నమః


భూత శుద్ధి

ఓం ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
       ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే  ||

అని పై శ్లోకం చెప్పి ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను

గంటా నాధం

ఓం ఆగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రాక్షసాం
      కురుఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

అని పై శ్లోకం చెప్పి గంధము, కుంకుమబొట్లు పెట్టి నమస్కరించుకొని గంటను మ్రోగించవలెను

ప్రాణాయామం

(కుడిచేతితో ముక్కు పట్టుకొని క్రింది మంత్రంను పఠిస్తూ మూడుసార్లు నాసిక (ముక్కు) తో గాలిని నెమ్మదిగా లోపలికి పీల్చి వదలి వేయడం చెయ్యాలి)

ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః . పరమాత్మా దేవతా .
దైవీ గాయత్రీ ఛందః . ప్రాణాయామే వినియోగః

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్ సవిర్వర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్.
ఓం మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భుర్భువ స్సువరోమ్.

పునరాచమనం

ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం

సంకల్పం

మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ వరసిద్ది మహా గణపతి ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే శ్రీమహావిష్ణో రాజ్ఞ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వ్తెవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖణ్డే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశ్తైలస్య.ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే.గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహరిక చాంద్రమానేన శార్వరి నామ సంవత్సరే.(దక్షిణాయనే).(వర్ష) ఋతౌ (బాధ్రపద) మాసే(._____) తిధౌ.(_____) వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ (మీ గోత్రం) గోత్రస్య (పేరు) నామధేయస్య, (పేరు) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్ధకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్ధ్యర్ధం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం సత్సన్తాన సౌభాగ్య శుభ ఫలావాప్యర్ధం శ్రీ వరసిద్ది మహా గణపతి ప్రీత్యర్ధం యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడసోపచార పూజాం కరిష్యే, తదంగత్వేన కలశారాధానం కరిష్యే

కలశ పూజ

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మ్రుతాః

కుక్షౌతు స్సాగర స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః

గంగేచ యమునేచైవ కృష్ణ గోదావరి సరస్వతి
నర్మదే సింధూ కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు

కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

కలశపాత్రపై కుడి అరచేయినుంచి పై మంత్రము చదివి కలశపాత్రకు గంధము, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

మహా (పసుపు ) గణపతి పూజ

ఓం గణానాం త్వా గణపతిగ్ హవామహే
       కవిం కవీనాముపమశ్రవస్తమం
       జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః

       అనశ్శృణ్వన్నూతి భిస్సీద సాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ మహాగణాధిపతయే నమః        ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః        పాదయోః పాద్యం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః        హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః        ముఖే శుద్దాచమనీయం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః        పంచామృత స్నానం, శుద్దోదక స్నానం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః        వస్త్రయుగ్మం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః        దివ్య శ్రీ చందనం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః        అక్షతాన్ సమర్పయామి


ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః
ఓం మహాగణాదిపతియే నమః


శ్రీ మహాగణాధిపతయే నమః        నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

శ్రీ మహాగణాధిపత్యేనమః              ధూపమాఘ్రాపయామి

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి

శ్రీ మహా గణాధిపతయే నమః                           గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
(అని చెపుతూ నీరు వదలాలి)

తాంబూలం సమర్పయామి,
నీరాజనం దర్శయామి
(అని చెపుతూ తాంబూలము సమర్పించి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాం త్వా గణపతిగ్ హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః

అనశ్శృణ్వన్నూతి భిస్సీద సాదనమ్

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి: ప్రచోదయాత్‌

శ్రీ మహాగణాధిపతయే నమః        సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ
శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

అని చెపుతూ  పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

వరసిద్ధి మహా గణపతి పూజా ప్రారంభం

ప్రాణ ప్రతిష్ఠాపనం

ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహినో ధేహిభోగమ్| జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతేమృడయాన స్స్వస్తి || అమృతంవై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే|

సాంగం సాయుధం సవాహనం సశక్తిం
పత్నీ పుత్రా పౌత్ర పరివార సమేతం

స్వామిన్ స్సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్
తావత్
త్వ్తం ప్రీతిభావేన కలశేస్మిన్ / చిత్రేస్మిన్ / ప్రతిమాయాం సన్నిధింకురు|
అవాహితోభవ, స్తాపితోభవ, సుప్రసన్నోభవ
, స్థిరోభవ, వరదోభవ, అవకుంఠితోభవ సుముఖోభవ, స్ధిరాసనంకురు ప్రసీద, ప్రసీద, ప్రసీద

(అక్షతలు, పుష్పములు దేవునిపై వుంచవలెను).

కలశం (కలశేస్మిన్) / చిత్ర పటం (చిత్రేస్మిన్) / విగ్రహం (ప్రతిమాయాం) మీరు ఏది వాడితే దానిలోకి ఆవాహన చేసుకోవాలి

ధ్యానమ్

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే
||
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‌
|
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్ట ప్రదం తస్మాత్‌ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్‌
||
ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితమ్‌
||

సుముఖశ్చైవ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షో  ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో
, హేరంబః స్కంద పూర్వజః

ఓం శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమ: ధ్యాయామి ధ్యానం సమర్పయామి

ఆవాహనము

అత్రాగచ్చ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః ఆవాహయామి

ఆసనం

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః రత్న సింహాసనం సమర్పయామి

అర్ఝ్యం

గౌరీ పుత్ర నమస్తేస్తు శంకరప్రియ నందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్‌

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  అర్ఘ్యం సమర్పయామి

పాద్యం

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః పాద్యం సమర్పయామి

ఆచమనీయం

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  ఆచమనీయం సమర్పయామి

మధుపర్కం

దధిక్షీరసమాయుక్తం మధ్యాజ్యేన సమన్వితమ్‌
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  మధుపర్కం సమర్పయామి

పంచామృత స్నానం

పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  పంచామృత స్నానం సమర్పయామి

శుద్దోదక  స్నానం

గంగాది సర్వతీర్ధభ్య ఆహృతైరమలైర్జలైః
స్నానం కురుష్యభగవన్‌ ఉమాపుత్ర నమోస్తుతే

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  శుద్దోదక స్నానం సమర్పయామి

వస్త్రం యుగ్మం

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం
శుభప్రద గృహాణ త్వం లమ్బోదర హరాత్మజ

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

ఉపవీతం

రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తనామిష్టదాయక

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి

శ్రీ గంధం

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్‌

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  శ్రీ గంధం సమర్పయామి

కుంకుమ

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  కుంకుమ సమర్పయామి

హరిద్రామ్

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  హరిద్రాన్ సమర్పయామి

ఆభరణం

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి.

పుష్పమాల

సుగన్ధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ
ఏకవింశతి పత్రాణి
, సంగృహాణ నమోస్తుతే

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  పుష్పై పూజయామి

అధాంగపూజ

ఇక్కడ మీరు అంఘ పూజను పువ్వులు లేదా అక్షతలఉపయోగించి చేయాలి.

ఓం గణేశాయ నమః                                    పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః                             గుల్ఫౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః                            జానునీ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః                          జంఘే పూజయామి
ఓం అఖువాహనాయ నమః                      ఊరూ పూజయామి
ఓం హేరంబాయ నమః                              కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః                           ఉదరం పూజయామి
ఓం  గణనాథాయ నమః                             నాభిం పూజయామి

ఓం గణేశాయ నమః                                    హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమః                          కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయ నమ:                        స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమ:                            హస్తౌ పూజయామి

ఓం గజవక్త్రాయ నమః                                 వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమః                               నేత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః                            కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః                          లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః                             శిరః పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః                          సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ

ఓం సుముఖాయ నమః              మాచీపత్రం పూజయామి
ఓం గణాధిపాయ నమః               బృహతీపత్రం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః           బిల్వపత్రం పూజయామి
ఓం గజాననాయ నమః               దుర్వాయుగ్మం పూజయామి
ఓం హరసూనవే నమః                దత్తూరపత్రం పూజయామి
ఓం లంబోదరాయ నమః            బదరీపత్రం పూజయామి
ఓం గుహాగ్రజాయ నమః             అపామార్గపత్రం పూజయామి
ఓం గజకర్ణాయ నమః                  తులసీపత్రం పూజయామి
ఓం ఏకదంతాయ నమః              చూతపత్రం పూజయామి
ఓం వికటాయ నమః                    కరవీరపత్రం పూజయామి
ఓం భిన్నదంతాయ నమః          విష్ణుక్రాంతపత్రం పూజయామి
ఓం వటవే నమః                             దాడిమీపత్రం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః             దేవదారుపత్రం పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః          మరువకపత్రం పూజయామి
ఓం హేరంబాయ నమః               సింధువారపత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః            జాజీపత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమః             గండకీపత్రం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః                శమీపత్రం పూజయామి
ఓం వినాయకాయ నమః           అశ్వత్థపత్రం పూజయామి
ఓం సురసేవితాయ నమః           అర్జునపత్రం పూజయామి
ఓం కపిలాయ నమః                     అర్కపత్రం పూజయామి
ఓం శ్రీ గణేశ్వరాయ నమః          ఏకవింశతి పత్రాణి పూజయామి

(ఆ తరువాత పుష్పాలను వాడుతూ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

వరసిద్ధి మహా గణపతి అష్టోత్తర శతనామావళి


ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీప్తాయ నమః

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బల్వాన్వితాయ నమః

ఓం బలోద్దతాయ నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం భావాత్మజాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వకర్త్రే నమః

ఓం సర్వ నేత్రే నమః

ఓం నర్వసిద్దిప్రదాయ నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః

ఓం కుంజరాసురభంజనాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థఫలప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళసుస్వరాయ నమః

ఓం ప్రమదాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షికిన్నరసేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

ఓం గంభీరనినదాయ నమః

ఓం వటవే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః

ఓం అభీష్టవరదాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్త రూపాయ నమః

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అపాకృతపరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః

ఓం సఖ్యై నమః

ఓం సారాయ నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం విశదాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం విష్ణువే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం ఐశ్వర్యకారణాయ నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విష్వగ్దృశే నమః

ఓం విశ్వరక్షావిధానకృతే నమః

ఓం కళ్యాణగురవే నమః

ఓం ఉన్మత్తవేషాయ నమః

ఓం పరజయినే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

ధూపం

వసస్పతుద్భవైర్దివ్యై:, నానాగంధై: సుసంయుత:|
ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్‌
||

దశాంగం గుగులోపేతం సుగంధం సుమనోహరం|
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ
||

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  దూపమాఘ్రాపయామి

దీపం

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  దీపందర్శయామి

నైవేద్యము

సుగంధాన్ స్సుకృతాంశ్చైవ మోదకాన్‌ ఘృతపాచితాన్‌ |
నైవేద్యం గృహ్యాతాం దేవ చణముద్గై: ప్రకల్పితాన్‌
||

భక్ష్యంభోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ |
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక
||

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః నైవేద్యం సమర్పయామి

నైవేద్యమునకు వండిన పదార్ధములపై కలశోదకములను జల్లి, తమస్తు అని పుష్పముతో కలశోదకమును పదార్ధములయందుంచవలెను

ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా - శ్రీ మహా గణాధిపతయే నమః  నైవేద్యం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

అని కుడిచేతిలో పుష్పముంచుకొని సమర్పణ చేయవలయును

అమృతాపిధానమసి, ఉత్తరాపోశనం సమర్పయామి, హసౌప్రక్షాళయామి, పాదౌప్రక్షాళయామి, శుద్దాచమనీయం సమర్పయామి
(అని అయిదు పర్యాయములు పుష్పముతోనుదకమునుంచవలయును.)

పానీయం

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవ / దేవీ శీతలం సుమనోహరం
శ్రీ
వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  పానీయం సమర్పయామి

తాంబూలం

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దశైర్యుతం,
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః తామ్బూలం సమర్పయామి.

సువర్ణ పుష్పం

సదానంద విఘ్నేశ పుష్కలాని దాననని చ  
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్య వినాయక

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః సువర్ణ పుష్పం సమర్పయామి.

నీరాజనం

ఘృతవర్తి సహ్రసైశ్చ కర్పూర శక లైస్తథా
నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

ఓం నతత్ర సూర్యో భాతిన చంద్ర తారకం
నేమా విద్యతో భాంతికుతో యమగ్నిః
తమేవ భాంతి మనుభాతి సర్వం |
తస్య భాసా సర్వమిదం విభాతి ||

ఓం సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధి పత్యం కర్పూర నీరాజనం దర్సయామి, నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి

దూర్వాయుగ్మ పూజ

ఓం గణాధిపాయ నమః                        దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఉమాపుత్రాయ నమః                    దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం అఘనాశనాయ నమః                  దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం వినాయకాయ నమః                     దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఈశపుత్రాయ నమః                      దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః               దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఏకదంతాయ నమః                       దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఇభవక్త్రాయ నమః                          దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం మూషిక వాహనాయ నమః        దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం కుమారగురవే నమః                      దూర్వాయుగ్మం సమర్పయామి

శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః దూర్వాయుగ్మ పూజాం సమర్పయామి.ధూపం

ఆత్మ ప్రదక్షిణ నమస్కారం

యానికానిచ పాపాని జన్నాంతర కృతానిచ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మమ సర్వదా
శ్రీ
వరసిద్ధి మహా గణపతి స్వామినే నమః  ప్రదక్షిణం సమర్పయామి

(అని మూడుసార్లు ప్రదక్షిణ చేసి శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామికి నమస్కరించవలయును.)

సాష్టాంగ నమస్కారం

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం సాష్టాంగవుచ్యతే ||

క్షమాపణం

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుమే

తత్సర్వం క్షమ్యతాందేవ మహా గణాధిపతయే నమోస్తుతే.

అనయామయాకృత పూజయా భగవతీ సర్వాత్మికాః శ్రీ వరసిద్ధి మహా గణపతి స్వామి ప్రీత్యర్ధం సుప్రీతా సుప్ర్సన్నా వరదాభవన్తు.(అని అక్షతలు నీళ్లు వదలవలెను.)

అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశంమయా |
దాసోయ మితిమాం మాత్వా క్షహస్వ వినాయక
||

ఆవాహనం నజానామి నజానామి విసర్జనం |
పూజావిధిం నజానామి క్షమస్వ గణనాయక
||

|| విఘ్నేశ్వర దండకం ||

శ్రీ పార్వతీపుత్ర లోకోత్తయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రేభావక్తా మహాకాయ కత్యాయనీనాధ సంజాత స్వామీ వివాసిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబులన్ నీదు కంఠంబు నీది బొజ్జ నీ మోము నీ మవుళి బాలేందు ఖండంబులు నాల్గు హస్తంబులు న్నీ కరాళంబులు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పదహస్తంబు లంబోదరమ్ సదా మూశికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ దివ్య రూమంబు దర్శించి హర్షించి సంప్రీతి మొక్కంగ శ్రీ గంధమున్ కుంకుమక్షతలాదులున్ పంకజముల్ తగన్ మల్లెలున్మొల్లలున్  మంచి చేమంతులున్ తెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలున్ పువ్వులున్ మంచి రూర్వంబులన్ తెచ్చి శాస్త్రోక్తరీతన్ సమర్పించి పూజించి సాష్టాంగమున్ చేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ, పొన్నంటిపండ్లున్, మరిన్మంచివౌ నిక్షుఖండంబులు నేగు బండ్లప్పడంబుల్ వడల్ , నేతి బూరెల్ మరిన్ గోదుమప్పంబుల్, పున్గులు న్బూరెలు న్గారెలున్ చొక్కమ్ చల్మిడిన్ బెల్లమున్ తెనేయున్ జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు నామంబు బిల్వంబు మేల్ బంగరు పళ్లేమందుంచి నైవేద్యముంబంచ నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్య దైవంబుల ప్రార్థనల్ సేయుటల్ కాంచనంబొల్లకే ఇన్ముదా గోరు చందంబుగాదె మహాదేవ యో భక్త మందార యో సుందరాకార యో భాగ్య గంభీరమో దేవ చూడామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత నీ దాసదాసాన దాసుండ శ్రీదాంత రాజాస్వరాయుండ రామాభిదాసుండ నన్నిపుడు చేపట్టి సుశ్రేయుసిరిజేసి శ్రీమంతుగా చూచి హృత్పద్మ సింహాసనారుడతన్నిల్చి కాపాడుటే కాదు నిన్గెల్చి పార్థించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పవై బుద్దియున్విద్యయు న్పాడియున్, పంటయున్, పుత్ర పౌత్రాభివృద్ధిన్, తగన్ కల్గగా జేసి పోషింపుమంటిన్ కృపన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే నమస్తే నమస్తే నమః

వినాయక వ్రత కథ

చేతిలోకి కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి.కథ పూర్తయిన తర్వాత వాటిని కొద్దిగా దేవునిపై వేసి, మిగిలినవి తమ శిరస్సుపై వేసుకోవాలి.

శ్రీ వినాయక వ్రతకథ ప్రారంభం

పూర్వం చంద్ర వంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను, బోధిస్తున్న సూత మహామునిని చూసి, నమస్కరించి “ఋషివర్యా, మేము రాజ్యాధికారాన్నీ సమస్త సంపదలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదైనా ఒక సులభమైన వ్రతాన్ని చెప్పండి” అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజు ప్రార్థనకు సంతసించి వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలూ కలుగుతాయి అని చెప్పాడు.

అప్పుడు ధర్మరాజు ఆ వ్రత విధాన్నాని తెలిపి, అంతకు ముందు దానిని ఎవరు ఆచరించారు మిగతా విషయాలను తెలుపవలేనని కోరగా అప్పుడు సూటు ఇలా చెప్పసాగాడు.

“ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ‘తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలనూ, విజయాలనూ, వైభవాలనూ పొందగలరో అటువంటి వ్రతాన్ని చెప్పండి” అని కోరాడు.

అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమోత్తమము, ఆయుష్కామ్యార్ధ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజున ఉదయమే నిద్రలేచి, అభ్యంగన స్నానం చేసి, నిత్యకర్మలు పూర్తిచేసుకొని తమ శక్తి మేరకు బంగారంతో గానీ, వెండితోగానీ, మట్టితోగానీ, విఘ్నేశ్వరుడి బొమ్మను ఏర్పరుచుకొని, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలములను, ఇరవై ఒక రకములు నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యధాశక్తి వేదవిదులైన బ్రాహ్మనోత్తములకు దక్షిణ, తాంబూలాదులు సమర్పించాలి. బంధుజనంతో కలిసి భక్ష్య, భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ, ముని గంధర్వాదులందరి చేతా ఆచరింపబడింది అని పరమ శివుడు కుమార స్వామికి” చెప్పాడు.

కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలనూ పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను” అంటూ ఇలా చెప్పసాగాడు.

“పూర్వం గజముఖుడైన  గజాసురుడు శివుడిని కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు ‘స్వామీ నువ్వు నా ఉదరమందు నివసించాలి’ అని కోరాడు ఆ గజాసురుడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు చేరిపోయాడు. జగన్మాత పార్వతి తన భర్త జాడ తెలియక ఆయనను వెదుకుతూ ఆయన గజాసురుని ఉదరం(కడుపు)లో ఉన్నాడని తెలుసుకొని, ఆయన్ను దక్కించుకునే ఉపాయం చెప్పమని  శ్రీమహా విష్ణువును కోరింది. అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించి, గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు వివిధ వాయిద్యములతో రసరమ్యంగా వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన శ్రీహరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి. ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించమని’ ని ప్రార్థించాడు. అప్పుడు శివుడు దానికి అంగీకరించడంతో తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. అప్పుడు శివుడు గజాసురుని ఉదరం నుండి బయటకు వచ్చి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్లగా, శివుడు నందినెక్కి కైలాసానికి బయలుదేరాడు.

వినాయక జననం

కైలాసంలో ఉన్న పార్వతి దేవి తన భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ట చేసింది. ఆ దివ్యసుందర రూపుడైన బాలుడిని వాకిట్లో ఉంచి, తన అనుమతి లేనిదే ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి స్నానాలంకారాల కోసం అభ్యంతర మందిరంలోనికి వెళ్లింది. కాసేపటికి శివుడు వచ్చి కొనికి వెల్లే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వాకిట్లో ఉన్న బాలుడు పరమ శివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపం వచ్చి, బాలుడిని మందలిస్తాడు. అయినను కూడా ఆ బాలుడు వినకపోయేసరికి కోపంతో వారి మద్య మాటల యుద్ధం దాటి, అది కాస్త అస్త్ర శస్త్ర యుద్ధంగా మారి దానిలో శివుడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి, లోపలికి వెళ్తాడు. లోపలకు వచ్చిన భర్తను చూసి ఆనందంలో ఉన్న పార్వతీ దేవి మాటల మధ్యలో జరిగింది తెలుసుకుని పార్వతి విలపిస్తుంది. శివుడు కూడా జరిగినది తెలుసుకొని చింతించి. వెంటనే గజాసురుని శిరస్సును తెప్పించి ఆ బాలుడి మొండేనికి అతికించి, గజాసురుడు కోరినట్లుగా ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్నీ త్రిలోక పూజ్యతనూ కలిగిస్తాడు. వినాయకుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల తనయుడైనాడు. ఆ తర్వాత కాలంలో శివపార్వతులకు కుమారస్వామి కలుగుతాడు.

విఘ్నేశాధిపత్యం

ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి గణములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరతాడు. అది విని కుమారస్వామి, గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్ధుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని తండ్రిని వేడుకుంటాడు. అందుకు శివుడు తన కుమారులను ఇరువురిని ఉద్దేశించి ‘మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది’ అని చెప్పాడు. అది వినినంతనే కుమారస్వామి తన మయూర వాహనాన్ని అధిరోహించి మెరుపు వేగంతో బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. చింతాక్రాంతుడైన వినాయకుడు, మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం అనేది కష్టసాధ్యమనీ దానికి తరుణోపాయం చెప్పమనీ తండ్రిని వేడుకుంటాడు. అప్పుడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు, నారాయణ మంత్రాన్ని అనుగ్రహించి, నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని అధీనములు, అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి అని చెప్పాడు. తండ్రి గారి అంతరార్తం తెలుసుకున్న వినాయకుడు ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ ముల్లోకాలకు అధిపతులైన తన తల్లిదండ్రులైన శివ పార్వతుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందుగానే వినాయకుడు స్నానమాచరించి తిరిగి వస్తున్నట్లుగా కనిపించింది కుమారస్వామికి. అలా మూడుకోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించి రావడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి చేరాడు. అక్కడే తండ్రిగారి పక్కన ఉన్న గజాననుణ్ణి చూసి, నమస్కరించి, ‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను. క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి’ అని ప్రార్థించాడు.

చంద్రుని పరిహాసం

అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేవతలు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్ళు  మొదలైన పిండివంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనముకిచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. కాని తన బొజ్జ నిండుగా ఉన్న కారణంగా ఉదరం భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా, శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థచూసి నవ్వాడు. రాజ దృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్నట్లు, విఘ్నదేవుని ఉదరంపగిలి, లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి, ‘పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ము లై నీలాపనిందలు పొందుదురు గాక’ అని శపించింది.

ఋషి పత్నులకు నీలాపనిందలు

అదే సమయంలో సప్తర్షులు యజ్ఞం చేస్తూ, తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి, శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక, మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతిని సంతోష పెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్లు తమ భార్యలే అని శంకించిన, ఋషులు తమ భార్యలను విడనాడినారు. ఋషిపత్ను లు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలూ, మునులూ పర మేశ్వరునికి తెలుపగా, అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధార పరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడైపడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు. అంత దేవతలందరూ ‘పార్వతీ దేవి, నీ శాపం వల్ల ముల్లోకాలకూ కీడు వాటిల్లుతోంది. ఉపసంహరించుకోవాలి’ అని ప్రార్థించారు. తన కుమారుడు పునర్జీవితుడు అయిన ఆనందంలో వారి కోరికను మన్నించినదై ‘శాప ఉపసంహరణ అనేది జరగదు, కాని వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు” అని శాపాన్ని సడలించింది అందరికి ఆనందాన్ని కలిగించింది.

శమంతకోపాఖ్యానం

ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీర ప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పిదుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి ‘అయ్యో నాకెలాంటి అపనింద రానున్నదో కదా అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్లాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ము డు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు. ఒక సింహం దాన్ని మాంస ఖండమని భావించి అతణ్ణి చంపి మణిని తీసుకుపోతోంది. అప్పుడు అటుగా వస్తున్న ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, మణిని, తన కుమార్తె అయిన జాంబతికి ఆడుకోవడానికి ఇచ్చింది. ఆ తరువాత మణికోసం తన తమ్ముణ్ణి శ్రీకృష్ణుడే చంపాడని సత్రాజిత్తు తన పట్టణంలో చాటించాడు. అది విన్న శ్రీకృష్ణుడు, చవితి చంద్రుణ్ణి చూసిన దోష ఫలమే కదా ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు సపరివార సమేతుడై అడవికి వెళ్లి వెదకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలి జాడలు, అటుపైన ఎలుగుబంటి అడుగు జాడలు  కనిపించాయి. వాటిని అనుసరిస్తూ ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహ ద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు గుహ లోపలికి వెళ్లి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా అక్కడున్న యువతి ఏడవడం ప్రారంభించింది. అది చూసి, జాంబవంతుడు శ్రీకృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్యా ఇరవై ఎనిమిది రోజులు భయంకర ముష్టి యుద్ధం జరిగింది. తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని దేవా త్రేతాయుగంలో నామీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలనీ కోరుకున్నాను. అప్పట్నుంచీ మీ నామస్మరణ చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేర్చడానికి వచావా!అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు జరిగినది తెలిపి శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణికోసం ఇలా వచ్చాను. ఇవ్వ’మని కోరతాడు. అంతట, జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతినీ కూడా ఇచ్చి పంపుతాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్నపెద్దలను ఒకచోట చేర్చి జరిగిన వృత్తాంతము అంతటిని తెలిపి, శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు ‘అయ్యో, లేనిపోని నింద మోపి తప్పుచేశా’నని విచారించి, మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి, క్షమించ'మని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబతీ, సత్యభామలను పరిణయమాడాడు. దేవతలు, మునులు, కృష్ణుణ్ణి స్తుతించి 'మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొన్నారు. మరి మాలాంటి వారి పరిస్థితి ఏమిటి' అని అడగ్గా భాద్రపద శుద్ధ చతుర్ధినాడు ప్రమాదవశాత్తూ, అనుకోకుండా చంద్రుణ్ణి చూసినవాళ్ళు గణపతిని పూజించి ఈ శమంతకమణి కథను విని, అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు’ అని చెప్పాడు కృష్ణుడు. అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధినాడు దేవతలూ, మహర్షులూ మానవులూ తమ తమ శక్తికొద్దీ గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో ఉన్నారు.

No comments:

Post a Comment

Quotation of the Day

Quotation of the Day https://youtube.com/shorts/v6hJRSc7MM4?si=19029rdHhVOFzhhY